Phone tapping case: కేసీఆర్ ఏమైనా దైవాంశ‌సంభూతుడా?.. బీఆర్ఎస్‍ నిరసనలపై ఆది శ్రీనివాస్ ఫైర్

by Prasad Jukanti |   (  Updated:2026-02-01 05:27:38  IST  )

దుర్మార్గ‌పు ప‌నులు చేసిన ముఠాకు నాయ‌కుడైన కేసీఆర్‍ను విచార‌ణ‌కు పిలిస్తే హడావిడి చేస్తారా? అని ఆది శ్రీనివాస్ మండిపడ్డారు.

Phone tapping case: కేసీఆర్ ఏమైనా దైవాంశ‌సంభూతుడా?.. బీఆర్ఎస్‍ నిరసనలపై ఆది శ్రీనివాస్ ఫైర్
X
దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) మాజీ సీఎం కేసీఆర్‍ను సిట్ అధికారులు విచారణకు పిలిచిన నేపథ్యంలో బీఆర్ఎస్ నిరసనలకు పిలుపునివ్వడంపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
(Aadi Srinivas)
మండిపడ్డారు. కేసీఆర్‍ను (KCR) విచార‌ణ‌కు పిలిస్తే బీఆర్ఎస్ నాయ‌కులు గ‌గ్గోలు పెడుతున్నారని, ఎందుకు కేసీఆర్‍ను పిల‌వొద్దని ప్రశ్నించారు. కేసీఆర్ ఏమైనా దైవాంశ‌సంభూతుడా? మాన‌వాతీతుడా? మ‌హ‌త్ముడా? అని నిలదీశారు. త‌ప్పు చేస్తే ఎంత‌టి వారైనా చ‌ట్టం ముందు నిల‌బ‌డాల్సిందేనని, శిబుసొరేన్, జ‌య‌ల‌లిత‌, ల‌ాలూ ప్రసాద్ యాదవ్, యడియూరప్ప లాంటి వారు జైళ్లకు వెళ్లడం బీఆర్ఎస్ కు కనిపించలేదా అని ప్రశ్నించారు.

ఇప్పుడు సన్నాయి నొక్కులా?:

అమ‌ర‌వీరుల త్యాగాల ఫ‌లితం త్యాగాల ఫ‌లితంగా వ‌చ్చిన తెలంగాణను నీచ‌ప‌నుల‌తో భ్రుష్టు ప‌ట్టించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినందుకు కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దుర్మార్గపు పనులు చేసిన ముటాకు నాయకుుడ కేసీఆర్ అని ఆయనను విచారణకు పిలిస్తే హడావుడి చేస్తారా? ప్రభుత్వాలు ట్యాపింగ్ చేయడం సహజమని ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని దుయ్యబట్టారు. ప్రజాప్రతినిధులు, ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టులు, జడ్జీల ఫోన్లు ట్యాప్ చేశారన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందంటే మాపైనే విమర్శలు చేశారని కానీ ఇప్పుడు కల్వకుంట్ల కవితనే స్వయంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెబుతున్నారన్నారు.

తెలంగాణ ఆత్మగౌరవంతో మీకేం సబంధం?:

బీఆర్ఎస్ హాయంలో అనేక అక్రమాలు జరిగాయని వాటిపైన విచారణలు జరుగుతున్నాయని చెప్పారు. కేసీఆర్ ను టచ్ చేస్తే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేసినట్లేనని మాట్లాడుతున్నారు. తెలంగాణ అంటే అమ‌ర‌వీరుల త్యాగాల ఫ‌లితం అని తెలంగాణ ఆత్మగౌరవం అంటూ మీరెందుకు ముడిపెట్టుకుంటున్నారని దుయ్యబట్టారు. మీ పార్టీ పేరు నుంచే తెలంగాణను తీసేసినప్పుడే తెలంగాణతో మీకు పేగు బంధం తెగిపోయిందని విమర్శించారు. తెలంగాణకు మీరు చేసిందేమి లేదని పదేళ్లు పాలించి ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారన్నారు. చ‌ట్టం ముందు అంద‌రూ స‌మానమేనని విచార‌ణ జ‌రిపి వివరాలు రాబట్టాల్సిందేనన్నారు.

Read More..

నేడు కేసీఆర్ నివాసంలో సిట్ విచారణ.. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల హై అలర్ట్!

Next Story