- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్.. మంత్రి పొంగులేటి మరో తీపి కబురు
ఇందిరమ్మ ఇండ్ల పథకంపై మంత్రి పొంగులేటి సమీక్ష నిర్వహించారు. పట్టణ ప్రాంతాల వారికి వెసులుబాటు కల్పిస్తూ కీలక విషయాలు వెల్లడించారు.

పట్టణ లబ్ధిదారులకు వెసులుబాటు:
గతంలో ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు చేసుకోని వారు, ఇప్పుడు దరఖాస్తుకున్నా కూడా అర్హత ఉంటే వారికి కూడా ఇంటిని మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు. వివిధ కారణాలతో ఇండ్లు నిర్మించుకోలేని వారు, తమకు ఇల్లు అవసరం లేదని తెలియచేస్తే వారి స్థానంలో మరొకరికి కేటాయించాలని అధికారులకు సూచించారు. ఇంటి బేస్మెంట్ నిర్మాణం పూర్తైన తరువాత కొంత నిధులు విడుదల చేశాక వివిధ సాంకేతిక కారణాలతో బిల్లులు రానివారికి తక్షణమే విడుదల చేయాలని అధికారులను ఆదేశించడారు. పేదవారి అభివృద్ధి సంక్షేమం విషయంలో అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. గత ప్రభుత్వం అక్కడక్కడా నిర్మించి, అసంపూర్తిగా వదిలేసిన డబుల్ బెడ్ రూం ఇండ్లను పూర్తి చేసి, మంచినీరు, కరెంటు, డ్రైనేజి వంటి మౌలిక వసతులను కల్పించి, ఇండ్లు ఏ స్థాయిలో ఉన్నా తక్షణమే లబ్ధిదారులకు కేటాయించాలని అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో స్థలాల కొరతను దృష్టిలో పెట్టుకుని 400 చదరపు అడుగులకు తగ్గకుండా 600 చదరపు అడుగులకు మించకుండా జి ప్లస్ వన్ పద్ధతిలో ఇండ్లను నిర్మించుకునేలా వెసులుబాటు కల్పంచినట్లు తెలిపారు.
భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం:
రాష్ట్రంలోని ఐదు మండలాలలో ప్రయోగాత్మకంగా సర్వే మ్యాపుతో రిజిస్ట్రేషన్ చేస్తున్నామని మంత్రి తెలిపారు. రిజిస్ట్రేషన్ పూర్తైన తరువాత సర్వే మ్యాపు నెంబరు, భూదార్ నెంబరు కేటాయిస్తున్నామని సాదా బైనామాలకు సంబంధించి వీలైనంత త్వరగా దరఖాస్తులను పరిష్కరిస్తామన్నారు. ఈ దరఖాస్తుల పరిష్కారం మరింత వేగవంతం చేయడానికి వీలుగా ఆర్డీవోలకే అధికారాలను అప్పగిస్తున్నట్టు చెప్పారు.రాష్ట్ర వ్యాప్తంగా దశలవారీగా, తహశీల్దార్ కార్యాలయాలను నిర్మిస్తామని తొలిదశలో శిధిలావస్థకు చేరిన చోట నిర్మిస్తామన్నారు. ప్రతిజిల్లా కేంద్రంలో అత్యాధునిక వసతులతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. దశాబ్దాల నుంచి రెవెన్యూ, ఫారెస్టు, ఎండోమెంట్, వక్ఫ్ మధ్య సరిహద్దు వివాదాలు ఉన్నాయని అలాంటి చోట్ల ఉమ్మడి సర్వే నిర్వహించి ఇటువంటి సమస్యలు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో నిజామాబాద్ ఇంఛార్జి మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) (Danasari Seethakka), ఆదిలాబాద్ ఇంఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao), మంత్రి వివేక్ వెంకటస్వామి (Vivek Venkatswamy), ప్రభుత్వ సలహాదారులు పి.సుదర్శన్ రెడ్డి, పోచారం శ్రీనివాస రెడ్డి, మహ్మద్ షబ్బీర్ అలీ, ఆయా జిల్లా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రెవెన్యూ కార్యదర్శి, హౌసింగ్ సెక్రటరీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.






