- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘రాముడు, కృష్ణుడు చూడలేదు.. కానీ మోడీని చూశా’.. తనికెళ్ల భరణి భావోద్వేగ పోస్ట్ వైరల్!
ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ప్రముఖ సినీ నటుడు, దర్శక రచయిత తనికెళ్ల భరణి మర్యాదపూర్వకంగా కలిశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ప్రముఖ సినీ నటుడు, దర్శక రచయిత తనికెళ్ల భరణి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మోడీపై ప్రశంసలు కురిపిస్తూ సోషల్ మీడియాలో చేసిన ఓ భావోద్వేగ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట తీవ్రస్థాయిలో వైరల్గా మారింది. ఆదివారం (మే 10) ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో ఆయన తెలంగాణ రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అలాగే వివిధ రాజకీయ సభలు, సమావేశాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్లతో పాటు పలువురు ప్రముఖులతో మోడీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఆప్యాయంగా పలకరించిన మోడీ..
పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణంలో భాగంగా ప్రధాని బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో మోడీ కోసం ఎదురుచూస్తున్న తనికెళ్ల భరణి.. ఆయనను ప్రత్యేకంగా కలిశారు. భరణి నమస్కరించగానే, ప్రధాని సైతం ఆయన చేతులు పట్టుకుని దగ్గరికి తీసుకుని ఎంతో ఆప్యాయంగా పలకరించారు. ప్రధానితో కలిసి ఉన్న ఈ అరుదైన ఫోటోను భరణి తన సామాజిక మాధ్యమాల (సోషల్ మీడియా) ఖాతాల్లో అభిమానులతో పంచుకున్నారు.
వైరల్ అవుతున్న తనికెళ్ల భరణి ట్వీట్
ఈ ఫోటోను షేర్ చేస్తూ.. తనికెళ్ల భరణి ఒక ఆసక్తికరమైన, భావోద్వేగమైన క్యాప్షన్ జోడించారు. ‘నేను రాముణ్ణి చూడలేదు, కృష్ణుణ్ణి చూడలేదు, ఆదిశంకరుల్ని చూడలేదు, వివేకానందుణ్ణి చూడలేదు.. అంటే చూడలేము కూడా! కానీ వాళ్లందరి అంశలతో ఉన్న మోడీ గారిని చూశాను, ముట్టుకున్నాను, చేతిని ముద్దెట్టుకున్నాను. నా జన్మ ధన్యం’ అని ట్వీట్ చేశారు. తనికెళ్ల భరణి చేసిన ఈ పోస్ట్ పై నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు. ప్రధానిపై ఆయనకున్న అభిమానానికి ఈ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయని పలువురు కామెంట్లు పెడుతున్నారు.






