పూర్తి నివేదిక ఇవ్వండి.. సజ్జనార్‌కు తెలంగాణ మానవ హక్కుల కమిషన్ నోటీసులు

by Prasad Jukanti |   (  Updated:2026-01-13 10:06:48  IST  )

సజ్జనార్ కు మానవ హక్కుల కమిషన్ నోటీసులు ఇచ్చింది.

పూర్తి నివేదిక ఇవ్వండి.. సజ్జనార్‌కు తెలంగాణ మానవ హక్కుల కమిషన్ నోటీసులు
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: చైనా మాంజా అమ్మొద్దు.. కొనొద్దని పోలీసులు ఎంత హెచ్చరించినా కొంత మంది పెడచెవిన పెడుతున్నారు. ఈ చైనా మాంజా వల్ల చాలా చోట్ల మనుషుల తలలు, కాళ్లు, చేతులు తెగుతున్నా తమకేమి కాదన్నట్లు మాంజాను గుట్టుగా వినియోగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో నిషేదిత చైనా మాంజా విషయంలో హైదరాబాద్ సీపీ సజ్జనార్‍కు తెలంగాణ మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. అడ్వకేట్ రామరావు ఇమ్మానేని దాఖలు చేసిన పిటిషన్లపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది. ఈ మేరకు మాంజా విషయంలో వచ్చే ఫిబ్రవరి 26లోపు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ నుంచి పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

READ MORE .....

మహిళా ఐఏఎస్‌పై ఆరోపణల వ్యవహారంలో కీలక పరిణామం.. సిట్ ఏర్పాటు చేసిన డీజీపీ

Next Story