ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పండి.. ప్రభుత్వం, ఈసీకి హైకోర్టు సూటి ప్రశ్న

by Ajay Maddhiboyina |   (  Updated:2025-10-17 07:26:27  IST  )

స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని తెలంగాణ ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌ను హైకోర్టు ప్రశ్నించింది. ఎన్నికలపై హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు కాగా, రీ నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలని పిటిషనర్ పేర్కొన్నారు.

ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పండి.. ప్రభుత్వం, ఈసీకి హైకోర్టు సూటి ప్రశ్న
X

దిశ, వెబ్ డెస్క్: స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని తెలంగాణ ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌ను హైకోర్టు ప్రశ్నించింది. స్థానిక సంస్థ‌ల‌కు సంబంధించి రీ నోటిఫికేష‌న్ ఇవ్వాలంటూ సురేంద‌ర్ అనే న్యాయ‌వాది పిటిష‌న్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని ప్రశ్నించింది. సుప్రీంకోర్టు కూడా ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని సూచించింది క‌దా అని గుర్తు చేసింది. దీంతో సుప్రీంకోర్టు చెప్పింది కానీ కోర్టు ఆర్డ‌ర్ కాపీలో ఎక్క‌డా లేద‌ని ఈసీ త‌రపు న్యాయ‌వాది చెప్పారు.

మాట‌ల్లో మాత్ర‌మే చెప్పార‌న్నారు. నిన్న‌నే ప్ర‌భుత్వానికి లేఖ రాశామ‌ని, ప్ర‌భుత్వంతో చర్చించిన త‌ర‌వాతే రీ నోటిఫికేష‌న్ ఉంటుంద‌ని కోర్టుకు తెలిపారు. దీంతో ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తామో చెప్పేందుకు రెండు వారాల సమయం కావాలని ప్రభుత్వం, ఎలక్షన్ కమిషన్ కోరగా హైకోర్టు ఇందుకు అంగీకరించింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. ఇదిలా ఉంటే జీవో 9తో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు కాగా స్టే విధించిన సంగతి తెలిసిందే.

Read More..

కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్‌కు కట్టుబడి ఉన్నది.. విలేకరుల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Next Story