- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Hilt Policy: హిల్ట్ పాలసీపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు
రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిన హిల్ట్ పాలసీపై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: స్టేట్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారిన హిల్ట్ పాలసీపై (HILT policy) తెలంగాణ హైకోర్టు (Telangana High Court)కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పాలసీపై కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వం తెచ్చిన హిల్ట్ పాలసీ జీవో నిబంధనలకు విరుద్ధం అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul), పర్యావరణవేత్త పురుశోత్తం (Purushotham) హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. 9,292 ఎకరాల భూకేటాయింపు నిబంధనలకు విరుద్ధమని, ఈ భూకేటాయింపు అంశంపై సీబీఐ లేదా ఈడీతో దర్యాప్తు చేయించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. రికార్డులు సీజ్ చేసి ఫోరెన్సిక్ ఆడిట్ చేయించాలని కోరారు. ఈ పిల్ పై ఇవాళ విచారణ జరిపిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు ఇస్తూ తదుపరి విచారణ ఈ నెల 29కి వాయిదా వేసింది.
Read More... మీరు కన్వెర్షన్ చేసిన ప్రతి గజం వివరాలు బయటపెడతా.. కేటీఆర్కు పొంగులేటి కౌంటర్






