సెక్రటేరియట్ ఓపెనింగ్‌కు అందుకే వెళ్లలేదు: గవర్నర్ తమిళిసై

by Disha Web Desk 2 |
సెక్రటేరియట్ ఓపెనింగ్‌కు అందుకే వెళ్లలేదు: గవర్నర్ తమిళిసై
X

దిశ, తెలంగాణ బ్యూరో: కొత్త సచివాలయం ప్రారంభోత్సవానికి తనకు ఎలాంటి ఆహ్వానం అందలేదని గవర్నర్ తరఫున రాజ్‌‌భవన్ అధికారపూర్వకంగా క్లారిటీ ఇచ్చింది. ఇన్విటేషన్‌ను పంపినా గవర్నర్ హాజరుకాలేదనే వార్తలు వస్తున్నాయని, కానీ ఈ వార్తలు తప్పుడు స్వభావంతో కూడుకున్నవి మాత్రమే కాక ఆధారరహితమైనవన్నారు. ఇన్విటేషన్ అందని కారణంగానే తాను కొత్త సచివాలయం ప్రారంభోత్సవానికి హాజరు కాలేదని గవర్నర్ క్లారిటీ ఇచ్చారు. గవర్నర్‌కు ఇన్విటేషన్ పంపినట్లు, తానే ఉద్దేశపూర్వకంగా గైర్హాజరైనట్లుగా కొన్ని వార్తలు వింటున్నానని, ఈ నేపథ్యంలోనే క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రకటన ఇవ్వాల్సి వస్తున్నదని పేర్కొన్నారు. ఇన్విటేషన్ అందనప్పుడు తాను ఎలా హాజరవుతానని ఆ ప్రకటనలో గుర్తుచేసి, అలాంటి ఆహ్వానం లేని కారణంగా మాత్రమే హాజరుకాలేకపోయినట్లు స్పష్టత ఇచ్చారు.

Read more :

డ్యూటీకి వస్తున్నారు.. వెళ్తున్నారు..! కొత్త సచివాలయంలో ఖాళీగా కూర్చుంటున్న అధికారులు! విధులు ప్రారంభించకపోవడానికి కారణం ఇదే



Next Story