RECORD: వేలంలో రూ.1.20 కోట్లు పలికిన గణపతి లడ్డూ

by Disha Web Desk 2 |
RECORD: వేలంలో రూ.1.20 కోట్లు పలికిన గణపతి లడ్డూ
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో గణపతి లడ్డూ సంచలన రికార్డు సృష్టించింది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఏకంగా 1.20 కోట్లు పలికింది. నగరంలోని రిచ్‌మండ్ విల్లాలో ఏర్పాటు చేసిన గణపతి వేలంలో ఈ రికార్డు క్రియేట్ అయింది. ఇక, మైహోమ్‌ భుజాలోని గణేశుని లడ్డూని రూ.25 లక్షల 50 వేలకు చిరంజీవి గౌడ్‌ అనే వ్యక్తి దక్కించుకున్నారు. గతేడాది కంటే రూ.7 లక్షలు అధికంగా ధర పలికింది. 2022లో రూ.18.50 లక్షలు పలికిన విషయం తెలిసిందే. కాగా, మరికాసేపట్లో బాలాపూర్‌ గణేశుడి లడ్డూ వేలం ప్రారంభం కానుంది. ఈ సారి పాతిక లక్షలు దాట నుందని ఉత్సవ కమిటీ సభ్యులు భావిస్తున్నారు. గతేడాది వంగేటి లక్ష్మారెడ్డి అనే వ్యక్తి రూ.24.60 లక్షలకు వినాయకుడి లడ్డూను దక్కించుకున్న విషయం తెలిసిందే.

Read More..

వేలానికి ముందే బాలాపూర్ లడ్డూ అరుదైన రికార్డు



Next Story

Most Viewed