ఎంజీబీఎస్‌లో అగ్నిప్రమాదం.. ఒక్కసారిగా చెలరేగిన మంటలు

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-05-26 08:32:21  IST  )

హైదరాబాద్ లోని మహాత్మాగాంధీ బస్ స్టేషన్(MGBS) లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

ఎంజీబీఎస్‌లో అగ్నిప్రమాదం.. ఒక్కసారిగా చెలరేగిన మంటలు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ లోని మహాత్మాగాంధీ బస్ స్టేషన్(MGBS) లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బస్టాండ్ లో గద్వాలకు వెళ్లే బస్సులు ఆగే ప్రదేశంలో.. ఓ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ప్లాట్ ఫామ్ వద్ద ఆగి ఉన్న బస్సులో మంటలు రేగడంతో.. బస్సులో ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే బస్సు దిగి మంటలార్పే ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న ఆర్టీసీ సిబ్బంది మంటలు వ్యాపించకుండా నీళ్లతో ఆర్పివేయడంతో.. పెద్దప్రమాదం తప్పినట్లయింది. మండుటెండల నేపథ్యంలో ఇటీవల రాష్ట్రంలో తరచూ అగ్నిప్రమాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో వాహనదారులు సైతం ఎండల్లో ప్రయాణించేటపుడు జాగ్రత్తగా ఉండాలని, వీలైనంత వరకూ అధిక ఉష్ణోగ్రతల సమయాల్లో ప్రయాణించవద్దని అధికారులు, ట్రాఫిక్ పోలీసులు కోరుతున్నారు.

ఓఆర్ఆర్ పై ఘోరప్రమాదం.. తగలబడుతోన్న ఎయిర్ ఇండియా బస్సు

Next Story