సాయంత్రం ఏం జరగబోతుంది.. గులాబీ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ!

by Disha Web Desk 2 |
సాయంత్రం ఏం జరగబోతుంది.. గులాబీ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో భాగంగా ఈడీ అధికారులు విచారిస్తున్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన విచారణ.. నాలుగు గంటలుగా రామచంద్ర పిళ్లైతో కొనసాగుతూనే ఉంది. అసలు ఈడీ అధికారులు ఏం విచారించారు. ఏ అంశాలను అడిగారు. కవిత ఏం సమాధానం ఇచ్చింది. అనేది హాట్ టాపిక్‌గా మారింది. పిళ్లైను విచారణ చేసి కోర్టులో హాజరు పరిచేందుకు తీసుకెళ్లారు. కవితను మాత్రం ఈడీ అధికారులు విచారిస్తూనే ఉన్నారు.

దీంతో ఒక్కసారిగా గులాబీ పార్టీ నేతల్లో టెన్షన్ మొదలైంది. ఎంక్వయిరీ తర్వాత ఏం చేస్తారనేది ఉత్కంఠ నెలకొంది. ఈనెల 11న ఈడీ అధికారులు రాత్రి 8:30 గంటల వరకు విచారణ చేపట్టారు. ఈరోజు ఎన్ని గంటల వరకు విచారణ చేస్తారు.. ఆ తర్వాత అరెస్టు చేస్తారా?.. మళ్లీ రావాలని కొరుతారా? అనేది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఏ ఇద్దరు గులాబీ నేతలు కలిసినా కవిత అంశాన్నే చర్చించుకుంటున్నారు. సాయంత్రం ఏం జరగబోతుంది అనేది పార్టీలో టెన్షన్ మొదలైంది.

Read more:

బిగ్ బ్రేకింగ్ న్యూస్: ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ...పదిన్నర గంటలపాటు సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు...ఈడీ ఆఫీసు నుంచి నేరుగా అక్కడికు వెళ్లిన కవిత!

భర్తకు హగ్ ఇచ్చిన కవిత.. ఈడీ విచారణకు ముందు ఆసక్తికర సీన్ (వీడియో)



Next Story

Most Viewed