ట్రాక్టర్‌ను ఢీకొన్న డీసీఎం వ్యాన్.. ఒకరు మృతి

by Jakkula.Mamatha |

జగిత్యాల-కరీంనగర్ ప్రధాన రహదారిపై మల్యాల క్రాస్ రోడ్డు సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

ట్రాక్టర్‌ను ఢీకొన్న డీసీఎం వ్యాన్.. ఒకరు మృతి
X

దిశ, మల్యాల: జగిత్యాల-కరీంనగర్ ప్రధాన రహదారిపై మల్యాల క్రాస్ రోడ్డు సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జగిత్యాల వైపు కట్టెల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనక నుండి వస్తున్న డీసీఎం వ్యాన్ ట్రాక్టర్‌ను బలంగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ పై ఉన్న వ్యక్తి రోడ్డుపై ఎగిరి పడటంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ప్రమాద తీవ్రతకు డీసీఎం వాహనం, ట్రాక్టర్ ముందు భాగం నుజ్జునుజ్జయింది. డ్రైవర్లు స్వల్ప గాయాలతో బయట పడినట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story