- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉపాధిహామీ పేరు మార్పుపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలు చేస్తోంది: రామచంద్రరావు
ఉపాధిహామీ పథకం పేరు మార్పుపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలు చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఉపాధిహామీ పథకం పేరు మార్పుపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలు చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. నరేగా పథకం ద్వారా ప్రజలకు మరిన్ని లాభాలు చేకూరేలా కేంద్రం మార్పులు చేసిందని చెప్పారు. పథకం పేరు మాత్రమే మార్చారని దాని వల్ల కాంగ్రెస్ నాయకులకు వచ్చిన నష్టం ఏంటో అర్థం కావడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి నరేగాపై మాట్లాడే అధికారం కూడా లేదని విమర్శించారు.
మన్మోహన్ సింగ్ పదవీకాలం పూర్తయ్యేవరకు ఈ పథకం ద్వారా కేవలం లక్షకోట్లు మాత్రమే దేశంలో ఖర్చు చేశారన్నారు. నరేంద్ర మోడీ వచ్చిన తరవాత ఎనిమిది లక్షల రూపాయలు గ్రామీణ ప్రాంతాల్లో ఖర్చు చేశామని చెప్పారు. ఎవరు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తున్నారో ప్రజలు ఆలోచించుకోవాలని అన్నారు. తెలంగాణలో గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే వికసిత్ భారత్ వైపు అడుగులు వేయాలని వ్యాఖ్యానించారు. వీబీ జీ రామ్ జీ పథకంలో రాముడు పేరు ఉందని, ఆయన ఆశీర్వాదంతో పాటు మోడీ కష్టం ఉన్నాయని అన్నారు.
READ MORE ....
తెలంగాణ బీజేపీలో మరోసారి సినీ గ్లామర్ డోస్.. కాషాయ గూటికి స్టార్ హీరోయిన్






