బిగ్ బ్రేకింగ్ : డ్రగ్స్ కేసులో Rakul Preet Singh కు ఈడీ నోటీసులు

by Disha Web Desk 4 |
బిగ్ బ్రేకింగ్ : డ్రగ్స్ కేసులో Rakul Preet Singh కు ఈడీ నోటీసులు
X

దిశ, వెబ్ డెస్క్: డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్‌కు నోటీసులు ఇచ్చిన ఈడీ అధికారులు ఈనెల 19న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. బెంగళూరు డ్రగ్స్ కేసులో తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి కూడా ఈడీ శుక్రవారం నోటీసులు జారీ చేసింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఇప్పటికే పలువురు హీరోలు, కీలక వ్యక్తులను ఈడీ గతంలో విచారించింది. తాజాగా విచారణకు హాజరు కావాలని రకుల్ ప్రీత్ సింగ్ కు నోటీసులు జారీ చేయడంతో సంచలనంగా మారింది. డ్రగ్ డీలర్లతో బ్యాంకు ట్రాన్షేషన్లపై విచారణ జరిపే అవకాశం ఉన్నట్లు తెలిసింది. డ్రగ్స్ డీలింగ్ తో సంబంధమున్న వ్యక్తులకు డబ్బులు పంపినట్లు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో పైలెట్ రోహిత్ రెడ్డి, రకుల్ ప్రీత్ సింగ్ లకు ఈడీ నోటీసులు జారీ చేసినట్లు సమచారం.

Also Read: బ్రేకింగ్ : డ్రగ్స్ కేసులో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు

రకుల్ ప్రీత్ సింగ్‌కు ఆ కేసుతో సంబంధం ఉంది: ఎమ్మెల్యే రఘునందన్ రావు


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed