మునుగోడుకు నేడు బండి ఎంట్రీ.. రసవత్తరంగా ప్రచారం

by Disha Web Desk |
మునుగోడుకు నేడు బండి ఎంట్రీ.. రసవత్తరంగా ప్రచారం
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ మంగళవారం నుంచి మునుగోడు ప్రచారానికి వెళ్లనున్నారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడ మండలంలోని తిరుగండ్లపల్లి, తమ్మడపల్లి గేట్, అజలాపురం, యరగండ్లపల్లి, కొండూరు గ్రామాల్లో రోడ్ షో నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు మర్రిగూడ క్రాస్ రోడ్ వద్ద నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఇదిలా ఉండగా 19వ తేదీన బూర నర్సయ్య గౌడ్ ఢిల్లీలో కాషాయ కండువా కప్పుకోనున్న నేపథ్యంలో ఆరోజు సంజయ్ తన ప్రచారానికి బ్రేక్ ఇవ్వనున్నారు. తిరిగి 20వ తేదీ నుంచి యథావిధిగా ప్రచారంతో హోరెత్తించనున్నారు.

ఇవి కూడా చదవండి : బీజేపీకు మునుగోడు భంగపాటు తప్పదేమో?

Next Story

Most Viewed