10 రోజుల క్రితమే నల్లగొండ సభ నుంచి వస్తుండగా యాక్సిడెంట్.. ఇంతలోనే..

by Disha Web Desk 4 |
10 రోజుల క్రితమే నల్లగొండ సభ నుంచి వస్తుండగా యాక్సిడెంట్.. ఇంతలోనే..
X

దిశ, వెబ్‌డెస్క్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత (33) కారు ప్రమాదంలో కన్నుమూశారు. కాగా లాస్యనందిత ఇటీవల మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన నల్లగొండలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు హజరయ్యారు. ఆ సమయంలో ఆమె ప్రయాణిస్తున్న కారును నార్కట్ పల్లి వద్ద ఓ టిప్పర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు ముందు టైర్ ఒక్క సారిగా ఊడిపోయింది. ఎమ్మెల్యే లాస్య నందిత తలకు స్వల్ప గాయాలయ్యాయి.

కాగా పది రోజుల వ్యవధిలో ఓఆర్ఆర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత కన్నుమూయడం విషాదం మిగిల్చింది. రాజకీయాల్లో ఎంతో భవిష్యత్తు ఉన్న యువ మహిళా నేత కన్నుమూయడం పట్ల స్థానికులు, బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఇటీవల లాస్య నందితకు ప్రమాదం జరిగిన తర్వాత మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు.

Read More : MLA లాస్యను వెంటాడిన మృత్యువు.. 60 రోజుల్లో మూడు ప్రమాదాలు.. ఇవాళ మృతి..!



Next Story

Most Viewed