- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
జూన్ 10లోగా పాఠశాలల్లో పనులు పూర్తి చేయాలి
దిశ,ఆదిలాబాద్ : జిల్లాలో జూన్ 10 వరకు అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపడుతున్న పనులను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా చేపట్టాల్సిన కనీస మౌలిక వసతులకు సంబంధించిన పనులను జూన్ 10 లోగా పూర్తిచేయాలని, శుక్రవారం జిల్లా కలెక్టర్ కలెక్టరేట్ సమావేశం మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో విద్య, పంచాయతీ, డీఆర్డీఓ, సీఈఓ, పీఆర్, డీఎల్పీఓఎస్, ఈఈ, డీఈఈ, ఈఈలు, డీఈ ఈలు, ఏఈఈలు, పెయింటింగ్స్ ఏజెన్సీలతో అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపడుతున్న పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ
పాఠశాలల్లో తాగునీటి సౌకర్యం, టాయిలెట్స్, ఎలక్ట్రిసిటీ, పెయింటింగ్, బెంచీలు, గ్రీన్ చాక్ బోర్డు, మేజర్, మైనర్ మరమ్మతులు, పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు చేపట్టాల్సిన పనులను త్వరితగతిన పూర్తిచేయాలని అన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపడుతున్న పనులు నాణ్యతలో రాజీ పడకుండా చేయాలని సూచించారు. పాఠశాలల్లో తాగునీటి సమస్య లేకుండా చూడాలని తెలిపారు. పాఠశాలల్లో తలుపులు, కిటికీలు, ఫ్లోరింగ్ తదితర వాటిని రిపేర్ చేయించుకోవాలని, టాయిలెట్స్ లేనిచోట కొత్తవి నిర్మాణం చేపట్టాలని అన్నారు.
పాఠశాలల్లో పనులు చేపట్టక ముందు, పనులు చేపట్టిన తర్వాత వాటి ఫొటోలను తీసి పంపించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మండలాల వారీగా ఒక్కొక్కరిని వారి పరిధిలో ఉన్న పాఠశాలల పురోగతిని అడిగి తెలుసుకొని, ఎక్కడెక్కడ ఇంకా పనులు ప్రారంభించ లేదో త్వరగా ప్రారంభించి జూన్ 10 లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. జూన్ 12న పాఠశాలలు ప్రారంభించబడతాయని ఆలోపే పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశాలు జారీచేశారు. ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్ అభిజ్ఞాన్, డీఈఓ ప్రణీత, సంబంధిత అధికారులు,తదితరులు పాల్గొన్నారు.