- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
Home > ఆంధ్రప్రదేశ్ > Tirumala Updates: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే?
Tirumala Updates: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే?
by Shiva |
X
దిశ, వెబ్డెస్క్: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిథి తిరుమలలో భక్తుల కొనసాగుతోంది. శుక్రవారం శ్రీవారిని దర్శనానికి జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి దాదాపు 18 గంటల సమయం పడుతోంది. వేసవి సెలవులు ముగిసినా భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతోంది. శనివారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండి కృష్ణతేజ గెస్ట్ హౌజ్ వరకు భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. శుక్రవారం స్వామి వారిని 66,782 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 36,229 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.71 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు వెల్లడించారు.
Advertisement
Next Story