ఏపీలో ఎమ్మెల్సీలుగా ఎంపికైన అభ్యర్థులు వీరే!

by  |
MLC Selection of Candidates
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో గవర్నర్ కోటాలోని నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు శుక్రవారం ఖాళీ కానున్నాయి. ఈ నేపథ్యంలో వాటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం అభ్యర్థులను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఆయా సామాజిక అంశాలను పరిగణలోకి తీసుకున్న పార్టీ అధిష్టానం నలుగురిని ఎంపిక చేసినట్లు సమాచారం.

పశ్చిమగోదావరి జిల్లా నుంచి మోషేను రాజు, గుంటూరు జిల్లా నుంచి లేళ్ల అప్పిరెడ్డి, కడప జిల్లా నుంచి ఆర్వీ రమేశ్ యాదవ్, తూర్పుగోదావరి జిల్లా నుంచి తోట త్రిమూర్తులతో భర్తీ చేయనున్నట్టు తెలుస్తోంది. వీరి పేర్లను ప్రతిపాదిస్తూ ప్రభుత్వం ఇప్పటికే గవర్నర్‌ బీబీ హరిచందన్‌కు ఫైలు పంపినట్టు సమాచారం. శుక్రవారం సాయంత్రం లేదా శనివారం గవర్నర్ హరిచందన్ వీటికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

సిక్కోలు వైసీపీలో లొల్లి.. అలిగిన కేంద్ర మాజీ మంత్రి


Next Story

Most Viewed