మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 35 రోజుల తర్వాత ఇంటికి చేరనున్న సాయి తేజ్

by  |
Sai Dharam Tej
X

దిశ, వెబ్‌డెస్క్: పండగ పూట మెగా ఫ్యామిలీ అభిమానులకు శుభవార్త చెప్పింది. మెగా మేనల్లుడు, హీరో సాయిధరమ్‌ తేజ్‌ ఈ రోజు ఉదయం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యినట్లు చిరంజీవి ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈరోజు దసరాతో పాటు సాయి తేజ్ పుట్టినరోజు కూడా కావడంతో మెగా ఫ్యామిలీలో ఆనందాలు వెల్లివిరిశాయి. ఈ సందర్భంగా చిరంజీవి సాయి తేజ్‌కు బర్త్‌డే శుభాకాంక్షలు తెలుపుతూ ” ఈ విజయదశమి స్పెషల్ రోజున సాయి తేజ్ పూర్తి ఆరోగ్యంతో ఇంటికి చేరుకున్నాడు. ఆ ప్రమాదం నుంచి అద్భుతంగా తప్పించుకొని బయటపడ్డాడు. తేజ్ కి ఇది పునర్జన్మ. సాయి తేజ్ కోలుకోవడం సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు. సెప్టెంబర్ 10న మెగా హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ విషయం తెలిసిందే. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాయి తేజ్ 35 రోజుల తర్వాత ఇంటికి తిరిగి రావడంతో మెగా ఇంట పండగ మరింత రెట్టింపయ్యింది.

పవన్ కళ్యాణ్ తో మంచు హీరో భేటీ.. కొత్త రాజకీయమా..?



Next Story

Most Viewed