హమాలీ పనిచేసి రూ. 100 సంపాదించిన RSP

by  |
హమాలీ పనిచేసి రూ. 100 సంపాదించిన RSP
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోళ్లు నెమ్మదిగా సాగుతున్నాయి. నెలల తరబడి కళ్లాల్లోనే ధాన్యం రాశులు ఉండిపోవడంతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకునేందుకు బీఎస్పీ స్టేట్ కోఆర్డినేటర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ జిల్లాల బాట పట్టారు. ఈ క్రమంలో నల్గొండ జిల్లాలోని నార్కట్‌పల్లి వద్ద ఉన్న కొనుగోలు కేంద్రాలను ఆర్ఎస్పీ సందర్శించారు. అక్కడున్న రైతులతో మాట్లాడిన ఆయన.. లారీల్లోకి బస్తాలను ఎక్కిస్తోన్న హమాలీలతో ముచ్చటించారు. అనంతరం హమాలీలతో కలిసి ధాన్యం బస్తాలను మోశారు. ఇలా చేయడం ద్వారా రూ.100 సంపాదించినట్లు ఆయన ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.

ఇండస్ట్రీయల్ పార్క్ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలి: RS ప్రవీణ్ కుమార్

https://twitter.com/RSPraveenSwaero/status/1465980468050812930?s=20


Next Story

Most Viewed