ఇండస్ట్రీయల్ పార్క్ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలి: RS ప్రవీణ్ కుమార్

by  |
ఇండస్ట్రీయల్ పార్క్ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలి: RS ప్రవీణ్ కుమార్
X

దిశ, చిట్యాల: పేద రైతుల పొట్ట కొట్టే ఇండస్ట్రీయల్ పార్క్ ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు, పిట్టంపల్లి గ్రామ రైతులతో బుధవారం ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు సాగు చేసుకుంటున్న వ్యవసాయ భూముల్లో ప్రభుత్వం ఇండస్ట్రీయల్ పార్క్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం అన్యాయమన్నారు. కేవలం బడా పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసం రెక్కాడితే గాని డొక్కాడని 400 మంది పేద రైతుల భూములు గుంజుకోవడం హేయమైన చర్యగా అభివర్ణించారు.

ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. తమకున్న వ్యవసాయ భూమిలో వరి, పత్తి పండుతుందని, అదే ఆధారంగా జీవిస్తున్నామని, భూమిని కోల్పోతే తమకు చావే దిక్కని కన్నీటి పర్యంతమయ్యారు.


Next Story

Most Viewed