RCBతోనే ఉండనున్న ఆ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు

by  |
RCBతోనే ఉండనున్న ఆ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు
X

దిశ, వెబ్‌డెస్క్: విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ బెంగుళూరు జ‌ట్టులోనే ఉండ‌నున్నారు. అయితే వచ్చే సీజ‌న్ కోసం జ‌ర‌గ‌నున్న ఆట‌గాళ్ల వేలానికి ముందే ఆయా జ‌ట్లు తాము రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను రిలీజ్ చేయాల్సి ఉంటుంది. అయితే కోహ్లీ, మ్యాక్స్‌వెల్‌ను త‌మ‌తోనే ఉంచుకోవాల‌ని బెంగుళూరు జ‌ట్టు భావిస్తున్నట్లు తెలుస్తోంది. గ‌రిష్టంగా న‌లుగురు ఆట‌గాళ్లను రిటైన్ చేసుకోవ‌డానికి ప్రతి జ‌ట్టుకు అవ‌కాశం ఉంటుంది. త‌మ వ‌ద్దే నిలుపుకున్న వారిలో ఇద్దరు విదేశీ ఆట‌గాళ్లు కూడా ఉండ‌వ‌చ్చు. రిటెన్షన్ విధానం ముగిసిన త‌ర్వాత‌ ఆట‌గాళ్ల వేలానికి ముందు.. కొత్త జ‌ట్లు ల‌క్నో, అహ్మదాబాద్‌లు ముగ్గురేసి ఆట‌గాళ్లను ఎంపిక చేసుకోవ‌చ్చు. ఇందులో ఇద్దరు ఇండియ‌న్లు, ఒక విదేశీ ప్లేయ‌ర్ ఉంటారు.

న్యూజీలాండ్-ఇండియా మ్యాచ్‌.. టాస్‌పై జిమ్మీ నీషమ్ సెటైర్


Next Story

Most Viewed