న్యూజీలాండ్-ఇండియా మ్యాచ్‌.. టాస్‌పై జిమ్మీ నీషమ్ సెటైర్

by  |
న్యూజీలాండ్-ఇండియా మ్యాచ్‌.. టాస్‌పై జిమ్మీ నీషమ్ సెటైర్
X

దిశ, స్పోర్ట్స్: కాన్పూర్ వేదికగా న్యూజీలాండ్ – ఇండియా మధ్య తొలి టెస్టు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇండియా పర్యటనకు వచ్చిన న్యూజీలాండ్ కెప్టెన్లు టాస్ ఓడిపోవడం ఇది వరుసగా నాలుగోసారి. తొలుత జరిగిన మూడు టీ20ల్లో టాస్ రోహిత్ శర్మ గెలిచాడు. ఇక తాజాగా కేన్ విలియమ్‌సన్ కూడా టాస్ ఓడిపోయాడు. దీంతో కివీస్ ఆటగాడు ట్విట్టర్ వేదికగా సరదాగా పోస్టు పెట్టాడు.

‘దయచేసి ఎవరైనా ఆ టాస్ వేసే కాయిన్లను ఒకసారి పరీక్షించండి’ అని ట్వీట్ చేశాడు. జిమ్మీ చేసిన ఈ సరదా ట్వీట్‌కు భారీగా స్పందన వచ్చింది. నెటిజన్లు ఆ ట్వీట్ కింద కామెంట్లు చేస్తున్నారు. టాస్ ఫిక్సింగ్ జరిగిందేమో అని ఒకరు కామెంట్ చేయగా.. మరొకరు విరాట్ కోహ్లీ వరుసగా 10 సార్లు టాస్ ఓడిపోయాడు.. పెద్దగా బాధపడకండి అని అన్నారు. ఒకరైతే మరీ పెద్దగా బాధపడకండి.. నెక్ట్స్ మ్యాచ్‌కు కోహ్లీ వచ్చేస్తాడు అంటూ కివీస్‌ని ఓదార్చే ప్రయత్నం చేశాడు.


Next Story