ఆర్‌సీ15 రిలీజ్ అక్కడే.. క్లారిటీ ఇచ్చిన చెర్రీ..

by  |
RC15
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్ పిక్చర్ల హవా నడుస్తోంది. కథ బాగుంటే ఆ సినిమా కోసం వందల కోట్లు కుమ్మరించేందుకు నిర్మాతలు సిద్దమవుతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమాల్లో చెర్రీ, శంకర్ కాంబో మూవీ ఒకటి. భారీ బడ్జెట్‌తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఇందులో చరణ్‌కి జోడీగా కియరా అద్వానీ నటిస్తోంది.

అయితే ఈ మధ్య కాలంలో పెద్ద స్టార్లు సైతం ఓటీటీ వైపు అడుగులు వేస్తుండగా.. ఆర్‌సీ15ను మేకర్స్ ఎందులో రిలీజ్ చేస్తారని అభిమానుల్లో సందేహాలు వస్తున్నాయి. దీంతో చెర్రీనే తాజాగా సినిమా రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చాడు. ‘ శంకర్‌ దర్శకత్వంలో నేను చేస్తున్న ఆర్‌సీ15 ఓ పొలిటికల్ డ్రామా. ఈ చిత్రాన్ని పక్కాగా థియేటర్స్‌లోనే విడుదల చేస్తామ’ని చెర్రి తెలిపాడు. అంతేకాకుండా ఈ సినిమా 2023 ఫిబ్రవరిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు కూడా చెర్రీ చెప్పాడు.

RRR అభిమానులకు బిగ్ షాక్.. బాంబ్ పేల్చిన జక్కన..


Next Story