- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ ప్రతినిధి , హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల సంఘం, ప్రభుత్వం త్వరలో నిర్వహించ తలపెట్టిన జీహెచ్ఎంసీ ఎన్నికలను వాయిదా వేయాలని నగరంలో పలు చోట్ల వాల్ పోస్టర్లు దర్శనమిచ్చాయి. ఐసీఎంఆర్ సర్వే ప్రకారం దేశంలో మిలియన్ల ప్రజలు కోవిడ్ బారిన పడ్డారని , వేలాది మంది మరణించారని, చలి కాలంలో కరోనా వైరస్ పెరిగే ప్రమాదముందని నీతి అయోగ్ హెచ్చరించిన నేపథ్యంలో గ్రేటర్ ఎన్నికలు వాయిదా వేయాలంటూ కరపత్రాలు నగరంలోని సైదాబాద్, ఓల్డ్ మలక్ పేట ప్రాంతాల్లో దర్శన మిచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా రెండో దశ విజృంభిస్తోందని, ఈ క్రమంలో ఎన్నికలు నిర్వహించడం సరికాదని పోస్టర్లో పేర్కొన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా, స్వేచ్ఛా యుతంగా జరగాల్సిన ఎన్నికలను ఈ విపత్కర పరిస్థితుల్లో నిర్వహించడం సాధ్యం కాదని పోస్టర్ లో పేర్కొన్నారు. రాబోయే వేసవి వరకు కరోనా తీవ్రత తగ్గితేనే ఎన్నికలను నిర్వహించాలని పోస్టర్లో రాసి ఉండడం కన్పించింది.