రాధాకిషన్ రావుకు బెయిల్ ఇవ్వొద్దు.. నాంపల్లి కోర్టులో పోలీసులు

by Disha Web Desk 13 |
రాధాకిషన్ రావుకు బెయిల్ ఇవ్వొద్దు.. నాంపల్లి కోర్టులో పోలీసులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ కేసులో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు బెయిల్ పిటిషన్ పై సోమవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా రాధాకిషన్ రావు బెయిల్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేసిన పంజాగుట్ట పోలీసులు.. రాధాకిషన్ రావుకు బెయిల్ ఇవ్వొద్దని కోరారు. కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్న నేపథ్యంలో పోలీసులు బెయిల్ ఇవ్వొద్దని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అనంతరం ఈ పిటిషన్ పై విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. కాగా ఏ4 నిందితుడిగా ఉన్న రాధాకిషన్ రావు.. ప్రస్తుతం చంచల్ గూడా జైలులో ఉన్నారు. అయితే అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్న తల్లిని చూసేందుకు రాధాకిషన్ రావుకు ఈనెల 20న కోర్టు మంధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో 21వ తేదీన జైలు పోలీస్ ఎస్కార్ట్ మధ్య కరీంనగర్ కు చేరుకుని ఆసుపత్రిలో ఉన్న తల్లిని చూసి వచ్చిన సంగతి తెలిసిందే.

Next Story

Most Viewed