- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రాధాకిషన్ రావుకు బెయిల్ ఇవ్వొద్దు.. నాంపల్లి కోర్టులో పోలీసులు
by Disha Web Desk 13 |
X
దిశ, డైనమిక్ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ కేసులో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు బెయిల్ పిటిషన్ పై సోమవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా రాధాకిషన్ రావు బెయిల్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేసిన పంజాగుట్ట పోలీసులు.. రాధాకిషన్ రావుకు బెయిల్ ఇవ్వొద్దని కోరారు. కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్న నేపథ్యంలో పోలీసులు బెయిల్ ఇవ్వొద్దని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అనంతరం ఈ పిటిషన్ పై విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. కాగా ఏ4 నిందితుడిగా ఉన్న రాధాకిషన్ రావు.. ప్రస్తుతం చంచల్ గూడా జైలులో ఉన్నారు. అయితే అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్న తల్లిని చూసేందుకు రాధాకిషన్ రావుకు ఈనెల 20న కోర్టు మంధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో 21వ తేదీన జైలు పోలీస్ ఎస్కార్ట్ మధ్య కరీంనగర్ కు చేరుకుని ఆసుపత్రిలో ఉన్న తల్లిని చూసి వచ్చిన సంగతి తెలిసిందే.
Next Story