- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఎన్నికల గుర్తుల కేటాయింపులో బిగ్ ట్విస్ట్.. టీడీపీ రెబల్ అభ్యర్థికి గాజు గ్లాస్ గుర్తు
దిశ, వెబ్డెస్క్: 2024 ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల కీలక ఘట్టం ముగిసింది. ఈ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ, ఉపసంహరణకు సంబంధించిన గడువు ఈ రోజు సోమవారం 3 గంటలకు ముగిసింది. దీంతో నామినేషన్లను పరిశీలించిన ఎన్నికల అధికారులు గుర్తింపు పొంది పార్టీ అభ్యర్థులతో పాటు రెబల్, స్వాంతంత్ర్య అభ్యర్థులకు గుర్తులను కేటాయిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల గుర్తుల కేటాయింపులో విజయనగరంలో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. టీడీపీ రెబల్ అభ్యర్థి అయిన మీసాల గీతకు ఎన్నికల అధికారులు గాజు గ్లాస్ గుర్తును కేటాయించారు. దీంతో టీడీపీ నేతలను ఆమెకు గాజు గ్లాసు గుర్తును కేటాయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కానీ అధికారులు మాత్రం రూల్స్ ప్రకారమే ఆమెకు గాజు గ్లాస్ గుర్తును కేటాయించామని తెలుపుతున్నారు. రెబల్ అభ్యర్థికి జనసేనకు సంబంధించిన గాజు గ్లాస్ గుర్తు రావడం తో డీటీపీ అభ్యర్థి, అతని అనుచరులు తమ గెలుపు పై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.