గుండెపోటుతో ఉపాధి కూలీ మృతి

by Disha Web Desk 11 |
గుండెపోటుతో ఉపాధి కూలీ మృతి
X

దిశ. భీమిని : మంచిర్యాల జిల్లా భీమిని మండలం తెలుగుపల్లె గ్రామానికి చెందిన పంబాల నాగయ్య, (58) ఉపాధి కూలీ గుండెపోటుతో మృతి చెందిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం... ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో ఉపాధి హామీ పనులకు వెళ్లి ఛాతీలో నొప్పి వస్తుందని నాగయ్య తోటి కూలీలతో చెప్పి ఇంటికి వెళ్లారు. నొప్పి ఎక్కువ కావడంతో స్థానికుల సహాయంతో ఆశా వర్కర్ కు సమాచారం అందించడంతో సిపిఆర్ చేసి 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు. అంతలోపే పరిస్థితి విషమించి మృతి చెందినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. గుండెపోటుతో మరణించిన ఉపాధి కూలీ కుటుంబ సభ్యులను మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎం.పీ.డీవో గంగా మోహన్. ఎం.పి.ఓ సఫ్దర్ అలీ. ఏ.పీ.వో సంఘర్స్ భాస్కర్ పరామర్శించారు.

Next Story