గాంధీ భవన్‌కు ఢిల్లీ పోలీసులు.. ఆ కేసులో నోటీసులు

by Disha Web Desk 4 |
Gandhi Bhavan
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అమిత్ షా ఫేక్ వీడియో కేసు స్టేట్ పాలిటిక్స్‌లో ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసుకు సంబంధించి సోమవారం ఢిల్లీ పోలీసులు గాంధీభవన్ కు వచ్చారు. అమిత్ షా ఫేక్ వీడియో కేసులో..కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకు చెందిన మన్నె సతీష్, నవీన్, శివకుమార్, తస్లీమ్‌కు నోటీసులు జారీ చేశారు. సీఆర్పీసీ 91 కింద పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇక, ఇదే కేసులో కాసేపటి క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేయగా.. మే 1న విచారణకు హాజరు కావాలని సమన్లలో ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఐటీ యాక్ట్‌లోని పలు సెక్షన్ల కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

Next Story

Most Viewed