ఇండియన్ ఆర్మీ మరో విజయం.. లష్కర్ కీలక నేత హఫీజ్‌ అబ్దుల్ మాలిక్‌ హతం

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-07 04:52:20  IST  )

పీవోకే (POK), పాక్‌లో ఉన్న ఉగ్రవాదులే స్థావరాలే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ (Indian Army) చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’ (Operation Sindoor) విజయవంతమైనట్లుగా అధికారుల ప్రకటించారు.

ఇండియన్ ఆర్మీ మరో విజయం.. లష్కర్ కీలక నేత హఫీజ్‌ అబ్దుల్ మాలిక్‌ హతం
X

దిశ, వెబ్‌డెస్క్: పీవోకే (POK), పాక్‌లో ఉన్న ఉగ్రవాదులే స్థావరాలే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ (Indian Army) చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’ (Operation Sindoor) విజయవంతమైనట్లుగా అధికారుల ప్రకటించారు. భారత్ జరిపిన వైమానిక దాడుల్లో ఇప్పటి వరకు అక్కడ 80 మంది వరకు ఉగ్రవాదులు మృతి చెందినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. బవహల్పూర్‌ (Bahawalpur)‌ కేంద్రంగా జైష్-ఎ-మహమ్మద్‌, మురిద్కే కేంద్రంగా ఉన్న లష్కర్-ఎ-తొయిబా క్యాంపులపై జరిపిన దాడుల్లో పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు హతమయ్యారు. ఇందులో భాగంగా మురిద్కేలోని మర్కజ్ తయ్యబా (Markaz Tayyaba)పై ఆర్మీ మెరుపు దాడులు చేసింది. ఈ క్రమంలోనే లష్కర్-ఎ-తొయిబా కీలక నేత హఫీజ్ అబ్దుల్ మాలిక్ (Hafiz Abdul Malik) మృతి చెందాడు. అతడితో పాటు మరో ఉగ్రనేత ముదాసిర్ (Mudasir) కూడా హతమయ్యాడు.

భారత సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత.. 8 మంది మృతి

ఉగ్రవాదులను పరామర్శించిన పాక్ ఆర్మీ ఆఫీసర్..భారత్‌కు వార్నింగ్

Next Story