కర్ణాటకలో మారనున్న ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చే పార్టీ అదే!

by Disha Web Desk 2 |
కర్ణాటకలో మారనున్న ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చే పార్టీ అదే!
X

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగింది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలున్న కర్నాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 113 సీట్లు. బీజేపీ కాంగ్రెస్ పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా రంగంలోకి దిగుతుండగా.. కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్ మాత్రం తామే కింగ్ మేకర్లుగా నిలుస్తామనే ధీమాతో ఉంది. ఇక పోలింగ్ ముగిసిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చాయి. మొదటగా విడుదలైన పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం రాష్ట్రంలో స్పష్టమైన మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని సర్వేలో వెల్లడైంది. ఈసారి కాంగ్రెస్‌కు 107-119 సీట్లు రావచ్చని అంచనా వేసింది. బీజేపీ 78-90 సీట్లు వచ్చే అవకాశం ఉందని, జేడీఎస్‌కు 23-29 సీట్లు రావచ్చని పేర్కొంది. మరి కాసేపట్లో విడుదల కానున్న మిగతా ఎగ్జిట్ పోల్స్ ఉంటాయో చూడాలి.

ఇవి కూడా చదవండి:

ముగిసిన కర్ణాటక ఎన్నికల పోలింగ్.. మొత్తం ఎంతశాతం నమోదైందంటే?






Next Story

Most Viewed