రోహిత్, గిల్ అర్ధ సెంచ‌రీలు...దాటిగా ఆడుతోన్న భార‌త్

by velandi.Saikiran |

లార్డ్స్ వన్డేలో భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, కెప్టెన్ గిల్ అద్భుతంగా రాణిస్తున్నారు

రోహిత్, గిల్ అర్ధ సెంచ‌రీలు...దాటిగా ఆడుతోన్న భార‌త్
X

దిశ‌, వెబ్ డెస్క్: లార్డ్స్ వన్డేలో భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, కెప్టెన్ గిల్ అద్భుతంగా రాణిస్తున్నారు. ఇంగ్లాండ్ విధించిన 387 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు ఓపెనర్లు అర్థ సెంచరీలు కూడా పూర్తి చేసుకున్నారు. 50 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ అర్థ సెంచరీ నమోదు చేసుకోగా.. కెప్టెన్ గిల్ 53 బంతుల్లో అర్థ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఇప్పటి వరకు 23 ఓవర్లు ఫినిష్ కాగా... వికెట్ న‌ష్ట‌పోకుండా 135 పరుగులు సాధించింది భారత జట్టు. విజయానికి మరో 253 పరుగులు కావలసి ఉంది. ఈ ఓపెనర్ల వికెట్లు పడగొట్టేందుకు ఇంగ్లాండ్ నాన‌ కష్టాలు పడుతోంది. కానీ సిరీస్ డిసైడర్ మ్యాచ్ కావడంతో ఓపెనర్లు రోహిత్, గిల్ చాలా జాగ్రత్తగా ఆడుతున్నారు. ఇటుక పేర్చినట్లుగా ఇన్నింగ్స్ ను డెవలప్ చేస్తున్నారు.

Next Story