- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు మరింత దూకుడు.. తాజా డిమాండ్స్ ఇవే..!
రాష్ట్రంలో Apstrc ఉద్యోగుల నిరసన కొనసాగుతోంది. ఆర్టీసీ ప్రైవేటీకరించొద్దంటూ రోజుకో కార్యచరణతో ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా సంతకాల సేకరణ చేపట్టారు....

X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో Apstrc ఉద్యోగుల నిరసన కొనసాగుతోంది. ఆర్టీసీ ప్రైవేటీకరించొద్దంటూ రోజుకో కార్యచరణతో ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా సంతకాల సేకరణ చేపట్టారు. ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోళ్లను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలన్న నిర్ణయాన్ని ఉద్యోగులు వ్యతిరేకించారు. E-బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ బస్సులను ఆర్టీసీ ద్వారానే నడిపించాలని కోరారు. అలాగే ఆర్టీసీకి అవసరమైన నిధులు, వనరులు కేటాయించాలని, సంస్థలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 27న జిల్లా కలెక్టర్ల ద్వారా సీఎం చంద్రబాబును కలిసి వినతి పత్రాలు అందజేయనున్నారు. స్త్రీ శక్తి పథకం ద్వారా పెరిగిన రద్దీ దృష్ట్యా కొత్త బస్సులు పెంచాలని ఆర్టీసీ జేఏసీ నేతలు విజ్ఞప్తి చేశారు.న
Next Story






