ఆందోళనకారులపై దూసుకెళ్లిన బస్సు.. పది మంది మృతి

by Gantepaka Srikanth |   (  Updated:2026-01-07 04:37:30  IST  )

ఇజ్రాయెల్ రాజధాని జెరూసలేంలో దారుణ ఘటన చోటుచేసుకుంది.

ఆందోళనకారులపై దూసుకెళ్లిన బస్సు.. పది మంది మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఇజ్రాయెల్ రాజధాని జెరూసలేం(Jerusalem)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. మంగళవారం జెరూసలేంలో సైనిక నిర్బంధానికి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలియజేశారు. వేలాది మంది హాజరైన ప్రదర్శనలో పురుషుల గుంపుపైకి ఓ బస్సు అతివేగంగా దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో దాదాపు పదిమంది యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా, రెండు సంవత్సరాల సుదీర్ఘ యుద్ధం తర్వాత సైన్యం మానవశక్తి కొరతను ఎదుర్కొంటున్నది. ఈ క్రమంలోనే పౌరులను బలవంతంగా సైన్యంలో చేర్చుకుంటున్నారు. దీనిని వ్యతిరేకిస్తూ ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లమీదకు వచ్చిన నిరసనలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే అనుకోని ప్రమాదం జరిగి పదుల సంఖ్యలో ప్రజలు మృతిచెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read More..

పాతబస్తీలో ఉద్రిక్తత.. భద్రతా దళాలపై రాళ్లు రువ్విన నిరసనకారులు

Next Story