నా తల కోసం ఎవరు వస్తారో చూస్తా.. ఉదయనిధి స్టాలిన్ సీరియస్

by Disha Web Desk 2 |
నా తల కోసం ఎవరు వస్తారో చూస్తా.. ఉదయనిధి స్టాలిన్ సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. దీనిపై బీజేపీ నేతలు, హిందుత్వ వాదులు, స్వామీజీలులు తీవ్రంగా స్పందిస్తుస్తున్నారు. ఇటీవల అయోధ్యకు చెందిన పరమహంస ఆచార్య అనే సాధువు ఉదయనిధి స్టాలిన్ తల నరికి తీసుకొస్తే రూ.10 కోట్లు ఇస్తానని సంచలన ప్రకటన చేశారు. ఆ ప్రకటన చేసే సమయంలో సాధువు కత్తితో స్టాలిన్ ఫొటోను పొడుస్తూ కనిపించాడు. దీనిని బట్టి స్టాలిన్ వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపుతున్నాయో అర్ధం చేసుకోవచ్చు.

తాజాగా.. సాధువు ప్రకటనపై స్టాలిన్ స్పందించారు. ఈ సందర్భంగా స్వామీజీలపై మండిపడ్డారు. నా తల తెస్తే రూ.10 కోట్లు అని ప్రకటించారు.. చూస్తా.. నా తల కోసం ఎవరు వస్తారో అని ఘాటుగా స్పందించారు. గతంలోనూ కరుణానిధిపై ఇలాగే రూ.కోటి ప్రకటించారని గుర్తుచేశారు. ఆరోజు కరుణానిధి ఎవరికీ భయపడలేదని.. ఈరోజు నేను కూడా ఎవరికీ భయపడబోనని అన్నారు. స్వామీజీలకు రూ.10 కోట్లు ఎలా వచ్చాయి అని అన్నారు. స్వామీజీలు అంత డబ్బు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. వాళ్లు నిజంగానే ఆధ్యాత్మిక స్వామీజీలా.. లేక దొంగ స్వామీజీలా? అని మండిపడ్డారు. వాళ్లు అక్రమంగా సంపాదించిన సొమ్ముకు లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. సనాతన ధర్మంలోని నియమాలపై డీఎంకే చివరి వరకు పోరాటం చేస్తుందని సవాల్ చేశారు.

More News : 100 కోట్ల ప్రజల మనోభావాలను దెబ్బతీశాడు.. 10 కోట్లు సరిపోకపోతే ఇంకా పెంచుతా: పరమహంస ఆచార్య

Next Story

Most Viewed