మరో వివాదంలో రాహుల్ గాంధీ.. స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన మహిళా ఎంపీలు

by Mahesh |
మరో వివాదంలో రాహుల్ గాంధీ.. స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన మహిళా ఎంపీలు
X

దిశ, వెబ్‌డెస్క్: మోడీ ఇంటి పేరు వివాదం నుంచి బయట పడి సభలో అడుగుపెట్టిన రెండు రోజులకే కాంగ్రెస్ రాహుల్ గాంధీ మరో వివాదంలో చిక్కుకున్నారు. మణిపూర్ ఘటనపై ఆయన వ్యాఖ్యలు దుమారం రేపగా.. సభ నుంచి వెళ్లిన రాహుల్ గాంధీ చేసిన పనికి మహిళా ఎంపీలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ శోభా కరంద్లాజే మాట్లాడుతూ.. ‘మహిళా సభ్యులందరికీ ఫ్లయింగ్‌ కిస్‌ ఇచ్చి రాహుల్‌ వెళ్లిపోయారని.. ఇది ఓ సభ్యుడి దురుసుగా ప్రవర్తించడమేనని అన్నారు.

అలాగే భారత పార్లమెంట్ చరిత్రలో ఇలా ఎన్నడూ జరగలేదు. రాహుల్ గాంధీ ఏంటి ఈ ప్రవర్తన అంటూ సభలో ఉన్న మహిళా ఎంపీలు రాహుల్ పై ఫైర్ అయ్యారు. అలాగే.. సీసీటీవీ ఫుటేజీ తీసి ఆయనపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కి ఫిర్యాదు చేశామని.. ఆధారాలు సేకరించి రాహుల్ గాంధీపై తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నట్లు మీడియా ముందు తెలిపారు.

Read More..

లోక్‌సభలో రాహుల్ గాంధీ అసభ్యకర ప్రవర్తన.. బయటకు వెళ్తూ ఏం చేశాడో తెలుసా?

Next Story

Most Viewed