సంబరాలు చేసుకుంటున్న ప్రజలు రాబందులు: ఒవైసీ

by Malleboina Mahesh |   (  Updated:2023-04-16 05:19:59  IST  )

గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్‌ను ముగ్గురు దుండగులు అతి కిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే.

సంబరాలు చేసుకుంటున్న ప్రజలు రాబందులు: ఒవైసీ
X

దిశ, వెబ్‌డెస్క్: గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్‌ను ముగ్గురు దుండగులు అతి కిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే. వారి హత్యపై AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. యోగి ప్రభుత్వం శాంతిభద్రతలలో ఘోరంగా విఫలమైందనడానికి ఈ హత్య సరైన ఉదాహరణ అని అన్నారు. హత్యాయత్నానికి తండోపతండాలుగా సంబరాలు చేసుకుంటున్న వాళ్ళు రాబందులని అన్నారు. రాజ్యాంగంపై ప్రజలకు ఇంకా విశ్వాసం ఉంటుందా అని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.

Read more:

అంబేడ్కర్ విగ్రహావిష్కరణలో సీఎం.. తుపాకీతో వ్యక్తి కలకలం

Next Story