కొనసాగుతున్న మూడో దశ పోలింగ్.. బరిలో ఉన్న ప్రముఖులు వీళ్లే..!

by Dishanational6 |
కొనసాగుతున్న మూడో దశ పోలింగ్.. బరిలో ఉన్న ప్రముఖులు వీళ్లే..!
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్ సభ ఎన్నికల మూడో దశ పోలింగ్ కొనసాగుతోంది. ఈ దఫాలో 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 93 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో 1,300 మందికి పైగా అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారిలో 120 మందికి పైగా మహిళలు ఉన్నారు.

కేంద్రమంత్రులు అమిత్‌ షా, జ్యోతిరాదిత్య సింధియా, మన్సుఖ్‌ మాండవీయ, పరుషోత్తమ్‌ రూపాలా, ప్రహ్లాద్‌ జోషి, ఎస్‌.పి.సింగ్‌ బఘెల్‌ మూడో విడత బరిలో ఉన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ములాయంసింగ్‌ యాదవ్‌ కుటుంబానికి ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ములాయం ఫ్యామిలీ నుంచి ముగ్గురు బరిలో ఉన్నారు. మైన్‌పురీలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ భార్య డింపుల్‌ యాదవ్‌ పోటీ చేస్తున్నారు. మరోవైపు మహారాష్ట్రలో బారామతి నియోజకవర్గం నుంచి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కుమార్తె ఎంపీ సుప్రియా సూలే పోటీ చేస్తున్నారు. అదే నియోజకవర్గం నుంచి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ బరిలో ఉన్నారు. ఏఐయూడీఎఫ్ చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కూడా పోటీలో ఉన్నారు. .

ఇకపోతే, మూడో విడతలో 17.24 కోట్ల మంది ఓటు వేయనున్నారు. వీరిలో 8.39 కోట్ల మంది మహిళలు. మొత్తం 1.85 లక్షల పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

Next Story