కవితకు మేలు చేయాలంటే బీఆర్​ఎస్​కు ఓటు వేయండి : మోడీ సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 15 |
కవితకు మేలు చేయాలంటే బీఆర్​ఎస్​కు ఓటు వేయండి : మోడీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్​డెస్క్​ : సీఎం కేసీఆర్ కూతురుకి లాభం చేయాలనుకుంటే బీఆర్​ఎస్​ పార్టీకి ఓటు వేయండి. మీకు, మీ పిల్లలకు, కుటుంబ సభ్యులకు మంచి జరగాలంటే బీజేపీకి ఓటు వెయండి అంటూ పీఎం మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా కుటుంబ పాలనపై భోపాల్ సభలో మోడీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీఆర్​ఎస్​ బీజేపీ ఒక్కటే అని ప్రచారం జరుగుతున్న వేళ ప్రధాని మోడీ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

మేరా బూత్ - సబ్ సే మజ్ బూత్ పేరుతో నిర్వహించిన భోపాల్ బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. రెచ్చగొడుతున్నాయని మండిపడ్డారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్నీ నెరవేర్చామని పేర్కొన్నారు. అయోధ్య రామమందిరం, కశ్మీర్ కు స్వయంప్రతిపత్తి తొలగించడం, యూనిఫాం సివిల్ కోడ్ తీసుకురావడం ముఖ్యమైనవని తెలిపారు. ఉమ్మడి పౌరస్మృతిపై ముస్లింలను కొన్ని రాజకీయ పార్టీలు అనవసరంగా రెచ్చగొడుతున్నాయని మండిపడ్డారు.

Read More..

KCR పై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు

Next Story

Most Viewed