ఆరుతడి పంటలే మేలు

by Jakkula.Mamatha |

రైతులు సాగునీరు అధికంగా అవసరమయ్యే పంటల కన్నా ఆరుతడి పంటలు వేసుకోవడం ఎంతో మేలని ఏఈఓ కృష్ణారెడ్డి పేర్కొన్నారు.

ఆరుతడి పంటలే మేలు
X

దిశ, దోమకొండ: రైతులు సాగునీరు అధికంగా అవసరమయ్యే పంటల కన్నా ఆరుతడి పంటలు వేసుకోవడం ఎంతో మేలని ఏఈఓ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. దోమకొండ మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా ఎల్‌నినో ప్రభావం పై మంగళవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏడాది వర్షాలు తక్కువ ఉన్నాయని సూచించారు. ఎల్ నినోతో వర్షాలు తక్కువగా నమోదయి భూగర్భ జలాలు తగ్గే అవకాశం ఉందన్నారు. రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని కోరారు. కార్యక్రమంలో PACS చైర్మన్ నాగరాజు రెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్ కదిరి గోపాల్ రెడ్డి, సొసైటీ డైరెక్టర్లు శంకర్ రెడ్డి, రాజు, కృష్ణారెడ్డి, నర్సింలు వార్డ్ మెంబర్ నేతుల మల్లేశం, అనంతరెడ్డి , రైతులు పాల్గొన్నారు

Next Story