బెంగాల్ సీఎం సువేందు అధికారి సంచలన నిర్ణయాలు

by Malleboina Mahesh |   (  Updated:2026-05-11 08:15:42  IST  )

ముఖ్యమంత్రి సువేందు అధికారి తన తొలి క్యాబినెట్ భేటీలోనే బెంగాల్‌లో అభివృద్ధి మరియు భద్రతపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

బెంగాల్ సీఎం సువేందు అధికారి సంచలన నిర్ణయాలు
X

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సువేందు అధికారి (Suvendu officer), తన తొలి క్యాబినెట్ సమావేశంలోనే రాష్ట్ర పరిపాలనలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తుంది. జాతీయ భద్రత (National security)కు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఫెన్సింగ్ పనులు పూర్తి చేయడానికి అవసరమైన భూమిని కేవలం 45 రోజుల్లోగా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) కు బదిలీ చేయాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం ఈ విషయంలో చేసిన జాప్యాన్ని తీవ్రంగా పరిగణించిన ఆయన, దేశ భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

అంతేకాకుండా, కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం పెంచుకుంటూ పలు కీలక సంక్షేమ పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు 'ఆయుష్మాన్ భారత్'ను నేటి నుంచే అమలు చేయాలని నిర్ణయించడంతో పాటు బేటీ బచావో-బేటీ పడావో, పీఎం ఉజ్వల యోజన వంటి పథకాలను రాష్ట్రంలో అమల్లోకి తెచ్చారు. అభ్యర్థులకు ఊరటనిస్తూ ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితిలో 5 ఏళ్ల సడలింపు ప్రకటించడం, కొత్త నేర చట్టాలను అమలు చేయాలని నిర్ణయించడం ద్వారా తన మార్కు పాలనను చాటుకున్నారు.

కేరళ సీఎం అభ్యర్థి ఎంపికపై బిగ్ సస్పెన్స్.. రంగంలోకి దిగిన హేమాహేమీలు!

Next Story