ఎయిరిండియా ఫ్లైట్ క్రాష్.. కాసేపట్లో అహ్మదాబాద్‌కు ప్రధాని మోదీ

by Kema Shiva Kumar |   (  Updated:2025-06-13 07:16:13  IST  )

అహ్మదాబాద్‌ (Ahmadabad)లో ఎయిరిండియా (Air India) కూలిన ఘటన దేశ వ్యాప్తంగా దగ్భ్రాంతికి గురి చేసింది.

ఎయిరిండియా ఫ్లైట్ క్రాష్.. కాసేపట్లో అహ్మదాబాద్‌కు ప్రధాని మోదీ
X

దిశ, వెబ్‌డెస్క్: అహ్మదాబాద్‌ (Ahmadabad)లో ఎయిరిండియా (Air India) కూలిన ఘటన దేశ వ్యాప్తంగా దగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ప్రమాదంలో 241 మంది ప్రయాణికులతో పాటు ఫ్లైట్ సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు. బీజే మెడికల్ కాలేజీ (BJ Medical College)పై విమానం కుప్పకూలగా మొత్తం 24 మంది మెడికోలు మృతి చెందారు. ఈ ఘటన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister) ఇవాళ కాసేపట్లో అహ్మదాబాద్‌కు రానున్నారు. అనంతరం ప్రమాదం జరిగిన స్థలాన్ని ఆయన పరిశీలించనున్నారు. ఇప్పటికే బీఎస్ఎఫ్ (BSF), ఎన్డీఆర్ఎఫ్ (NDRF) సహాయక బృందాలు మృతదేహాల వెలికితీత ప్రక్రియను పూర్తి చేశాయి. డీఎన్ఏ పరీక్షల ఆధారంగా మృతులను గుర్తించి వారి కుటుంబాలకు అప్పగించనున్నారు.

Read More..

2025ని వెంటాడుతున్న విషాదాలు..ఆరు నెలల్లో ఎన్ని ప్రమాదాలు జరిగాయంటే?

Next Story