ప్రియమణి చేసిన పనికి షాక్ అవుతున్న నెటిజన్లు..

by Dishafeatures1 |
ప్రియమణి చేసిన పనికి షాక్ అవుతున్న నెటిజన్లు..
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరోయిన్ ప్రియమణి ప్రజంట్ మంచి మంచి పాత్రలు ఎంచుకుంటూ పలు చిత్రాలు , సిరీస్ లు చేసుకుంటూ పోతోంది. ఇటీవల ‘ఆర్టికల్ 370’, ‘భామ కలాపం-2’ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిన్నది. తన నటనతో ఎంతగానో అలరించింది. అయితే తాజాగా ప్రియమణి చేసిన ఒక పని ఆమెను వార్తల్లో నిలిచేలా చేసింది. ఇంతకీ విషయం ఏంటంటే.. ప్రియమణి ఇటీవల కేరళ రాష్ట్రంలోని త్రీకైల్ మహదేవన్ ఆలయాన్ని సందర్శించి. ఈ ఆలయానికి ప్రియమణి ఏనుగును విరాళంగా అందించింది. ఏనుగు అంటే మామూలు ఏనుగు కాదండోయ్ రోబోటిక్ ఏనుగు. దీని పేరు ‘మహాదేవన్’.

అయితే నిజానికి ఈ మహాదేవన్ ఆలయంలో ఎలాంటి దైవకార్యానికైనా ఏనుగులను అసలు ఉపయోగించరు. మతపరమైన కార్యక్రమాల్లో మూగజీవాలను ఉపయోగించకూడదని అక్కడి దేవస్థానం నిర్ణయించింది. ఎందుకంటే ఏనుగులు ఒక్కొక్కసారి విచిత్రంగా ప్రవర్తిస్తాయి. కొన్నిసార్లు భక్తులను చంపేస్తుంటాయి కూడా. అందుకే అక్కడ ఏనుగులను రానివ్వరు.

ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రియమణి రోబోటిక్ ఏనుగును బహుమతిగా ఇచ్చి, ఆలయ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేసింది. ఇక ఈ రోబోటిక్ ఏనుగుకు ఆలయ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. ‘మూగ జీవాలను మనుషులుగా మనం కాపాడాలి. అవి బాగుంటేనే జీవ వైవిధ్యం కొనసాగుతుంది. జంతువులకు హాని తలపెట్టకుండా ఉండడమే మన ధర్మం. అవి బాగుంటేనే సంస్కృతి కూడా బాగుంటుంది’ అని ప్రియమణి తెలిపింది. ఇక నటి చేసిన ఈ పని పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read More..

నేను పవన్ కళ్యాణ్‌ను పిచ్చిగా ప్రేమించా..! ఆ విషయం ఇన్నాళ్లు ఎందుకు గోప్యంగా ఉంచిందంటే?




Next Story

Most Viewed