- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ సారి నిశ్శబ్దం లేదు పోరాటమే.. ఆసక్తికరంగా ‘ది కేరళ స్టోరీ-2’ ట్రైలర్
వారు మన కుమార్తెలను లక్ష్యంగా చేసుకున్నారు.. వారి భవిష్యత్తును దొంగిలించారు

దిశ, సినిమా: బాక్సాఫీస్ వద్ద భారీ సంచలనం సృష్టించి, దేశవ్యాప్తంగా చర్చలకు దారితీసిన ‘ది కేరళ స్టోరీ’ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ సిద్ధమైంది. ‘ది కేరళ స్టోరీ-2: గోస్ బియాండ్’ (The Kerala Story-2: Goes Beyond)పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అప్పుడే రాజకీయంగా, సామాజికంగా ప్రకంపనలు మొదలయ్యాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ది కేరళ స్టోరీ’కి కొనసాగింపుగా వస్తున్న సీక్వెల్ ట్రైలర్ తాజాగా విడుదలైంది. మొదటి భాగం కేవలం మత మార్పిడుల చుట్టూ తిరిగితే, ఈ రెండో భాగం అంతకు మించిన వివాదాస్పద అంశాలను టచ్ చేయబోతున్నట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా "ఈసారి మనం నిశ్శబ్దంగా ఉండం.. పోరాడతాం" అనే నినాదం సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. ‘‘వారు మన కుమార్తెలను లక్ష్యంగా చేసుకున్నారు.. వారి భవిష్యత్తును దొంగిలించారు’’ అనే డైలాగులు సినిమాలో తీవ్రమైన భావోద్వేగాలను పండించనున్నాయి. విడుదలైన కొద్ది సేపటికే ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక అది చూసిన నెటిజన్లు ఈ సినిమా వాస్తవాలను బయటపెడుతుందని సమర్థిస్తుంటే, మరికొందరు ఇది సమాజంలో విభజన తెస్తుందని విమర్శిస్తున్నారు.
అయితే మేకర్స్ మాత్రం, ఇది కేవలం బాధితుల పక్షాన నిలబడి తీసిన సినిమా అని చెబుతున్నారు. కాగా.. ఈ సినిమాలో ఉల్క గుప్తా(Ulka Gupta), అదివి భాటియా, ఐశ్వర్య ఓజా (Aishwarya Ojha)ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ముగ్గురు హిందూ యువతులు, ముగ్గురు ముస్లిం యువకులతో ప్రేమలో పడిన తర్వాత వారి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి? ఆ ప్రేమ వెనుక దాగి ఉన్న మత మార్పిడి ప్రణాళికలు ఏంటి? అనే అంశాలను దర్శకుడు కమఖ్యా నారాయణ్ చాలా రా అండ్ రస్టిక్గా చూపించబోతున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. పొలిటికల్ డ్రామాలు, వాస్తవ సంఘటనల ఆధారంగా వచ్చే సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా ఒక పవర్ఫుల్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.






