‘బలగం’ సినిమా చూస్తూ.. కన్నీరుమున్నీరైన మునిపంపుల

by Disha Web Desk 2 |
‘బలగం’ సినిమా చూస్తూ.. కన్నీరుమున్నీరైన మునిపంపుల
X

దిశ, వెబ్‌డెస్క్: చిన్న సినిమాగా విడుదలై.. భారీ విజయం సాధించిన చిత్రం బలగం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.25 కోట్ల వరకు కలెక్షన్లు కొల్లగొట్టి భళా అనిపించింది. సినిమాను థియేటర్లలోచూసిన అభిమానులు తమ కుటుంబ సభ్యులు, బంధువులకు చూపించాలన్న తాపత్రయంలో అనేక గ్రామాల్లో ఎల్‌ఈడీ స్ర్రీన్లలో ప్రదర్శిస్తున్నారు. తాజాగా.. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం మునిపంపుల గ్రామంలోనూ బీజేపీ సిటీ వింగ్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి సినిమాను ప్రదర్శించారు. దీంతో సినిమాను చూసిన వందలాది మంది గ్రామ ప్రజలు క్లైమాక్స్‌లో కన్నీరుమున్నీరుగా విలపించారు. ఒక అద్భుతమైన సినిమాను తమకు చూపించిన నిర్వాహకులు మామిండ్ల నరేందర్‌, సుధీర్, వంగాల మహేందర్, మామిడి అంజిరెడ్డిలకు గ్రామ ప్రజలు ధన్యవాదాలు చెప్పారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు నరేందర్ మాట్లాడుతూ.. సమాజంలో కుటుంబ విలువలు కనుమరుగైపోతున్న తరుణంలో బలగం సినిమా తీసిన డైరెక్టర్ వేణు యెల్దండికి కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలని ఆకాంక్షించారు.

Also Read: మనం ఇలాంటివి ఎన్నో చేయాలి ‘దసరా’ సినిమాపై ప్రభాస్ స్పెషల్ పోస్ట్..



Next Story