ఆ మాట నా హృదయాన్ని కలిచివేసింది.. బీఆర్ఎస్‌ ఎంపీపై Ram Charan ప్రశంసలు

by Disha Web Desk 9 |
ఆ మాట నా హృదయాన్ని కలిచివేసింది.. బీఆర్ఎస్‌ ఎంపీపై Ram Charan ప్రశంసలు
X

దిశ, వెబ్‌డెస్క్: గ్లోబర్ స్టార్ రామ్ చరణ్ గురించి సుపరిచితమే. ఈ హీరో తాజాగా ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ రచించిన ఛాయా చిత్రాలతో కూడిన ‘వింగ్స్ ఆఫ్ పాషన్’’ అనే పుస్తకాన్ని ఈరోజు (ఆగస్టు 20)న సంతోష్ నివాసంలో రామ్ చరణ్ ఆవిష్కరించారు. జోగినపల్లిని పొగుడుతూ.. ‘‘ప్రస్తుత రోజుల్లో కళల పట్ల ఇంట్రెస్ట్ కలిగిన వారు అరుదుగా ఉంటారు. అందులో మంచి మనసున్న పర్సన్స్‌లో సంతోష్ ఒకరు. ఈయన తీసిన ఛాయా చిత్రాలు ఎంతో బాగా నచ్చాయి. ‘పక్షులతో ఉన్నప్పుడు నిశ్వబ్ధంగా ఉండాలని’ బుక్‌లో వారు చెప్పిన మాట నా హృదయాన్ని కలచివేసింది. జీవుల పట్ల ఎంతో కరుణా, జాలి, ప్రేమ, వాటితో నిరంతర సావాసం చేస్తే వాటి భావాలు అర్థం చేసుకోలేం. అలాంటిది పక్షులు, మూగజీవులను అర్థం చేసుకోవడానికి ఈయన ఎంత కష్టపడ్డాడో ఈ ఒక్క చాలు. పాలిటిక్స్ నుంచి వచ్చి ఈ విధంగా ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్‌లా ఫొటోలు తీసి.. వాటిని పుస్తకంగా తీసుకొచ్చిన నేత బహుశ జోగినిపల్లి సంతోష్ కుమార్ ఒక్కరే ఉండొచ్చని నేను భావిస్తున్నాను.’’ అంటూ మెగా ప్రిన్స్ రామ్ చరన్ సంతోష్‌ను పొగడ్తలతో ముంచెత్తారు.

ఇవి కూడా చదవండి : Vijay Devarakonda : ఆ కారణంగానే OTT లో సినిమాలు, Web Series లు చేయనంటోన్న..

Next Story