ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి పరార్‌

by Kodari Anjali |

మానసిక చికిత్సలయంలో చికిత్స పొందుతున్న పేషెంట్ పరారీ అయిన ఘటన బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి పరార్‌
X

దిశ, జూబ్లీహిల్స్: మానసిక చికిత్సలయంలో చికిత్స పొందుతున్న పేషెంట్ పరారీ అయిన ఘటన బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... వికారాబాద్‌ జిల్లా తాండూర్‌కు చెందిన అబ్బాని జగదీశ్వర్‌(28) ఎర్రగడ్డ మానసిక చికిత్సలయంలో చికిత్స పొందుతున్నాడు. శనివారం రాత్రి ఆసుపత్రి నుండి పారిపోయినట్లు ఆయన సోదరుడు వినయ్‌ కుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దవాఖాన పరిసర ప్రాంతాల్లో గాలించినప్పటికీ అతని ఆచూకీ లభించలేదు. ఈ ఘటనపై బోరబండ పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. అదృశ్యమైన వ్యక్తి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Next Story