- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ నరకం ఎవరికీ రాకూడదు.. రాత్రంతా ఏడుస్తూ నిద్రపోయేదాన్ని: Mrunal Thakur
ను అక్షయ్ సార్ను కలిసినప్పుడు ఆయన నాకు ఒక అందమైన మాట చెప్పారు.

దిశ, సినిమా: ‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ‘సీత’గా చెరగని ముద్ర వేసుకున్న మృణాల్ ఠాకూర్(Mrunal Thakur), గ్లామర్ ప్రపంచంలో తాను ఎదుర్కొన్న చీకటి రోజుల గురించి మొదటిసారి మనసు విప్పి మాట్లాడారు. కేవలం తన శరీరాకృతి కారణంగా ఎదురైన బాడీ షేమింగ్ తనను ఎంతలా కృంగదీసిందో వివరిస్తూ ఎమోషనల్ అయ్యారు. తాజాగా, ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మృణాల్ మాట్లాడుతూ.. ‘‘ఒకప్పుడు సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ చూసి చాలా బాధపడేదాన్ని. ఆ నరకం ఎవరికీ రాకూడదనిపించింది. రాత్రంతా ఏడుస్తూ నిద్రపోయిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఉదయం లేవగానే నా కళ్లు వాచిపోయేవి. నలుగురిలో కలవాలంటే భయం వేసేది. ఎప్పుడూ ఇతరుల ఫిజిక్ను చూస్తూ.. నా బాడీ ఎందుకు ఇలా లేదు అని నన్ను నేనే నిందించుకునేదాన్ని’’ అని చెప్పుకొచ్చారు. అయితే జిమ్లో ఒక అభిమాని తనను ఆరాధించడం చూశాక, తనను తాను ప్రేమించుకోవడం ఎంత ముఖ్యమో అర్థమైందని ఆమె పేర్కొన్నారు.
ఈ కఠిన పరిస్థితుల్లో బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ఇచ్చిన సలహా తన జీవితంలో టర్నింగ్ పాయింట్ అని మృణాల్ తెలిపారు. ‘‘నేను అక్షయ్ సార్ను కలిసినప్పుడు ఆయన నాకు ఒక అందమైన మాట చెప్పారు. 'నీ శరీరాకృతిని నువ్వు మనస్ఫూర్తిగా అంగీకరించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. చుట్టుపక్కల వాళ్లు నిన్ను ఇబ్బంది పెట్టేలా వేయి మాటలు అంటారు. కానీ నువ్వు మాత్రం నీ మనసు చెప్పినట్టే విను. ఒకవేళ ఏదైనా పాత్ర కోసం నువ్వు బరువు తగ్గాల్సి వస్తే, ఆ ప్రొఫెషనల్ అవసరం కోసమే చేయి తప్ప, ఇతరుల విమర్శల కోసం కాదు’’ అని ఆయన చెప్పారు. ఆ మాటలు నాలో కొండంత ధైర్యాన్ని ఇచ్చాయి. అప్పటి నుంచి అదే ఫాలో అవుతున్నాను’’ అని మృణాల్ వివరించారు. అక్షయ్ మాటలతో ఇప్పుడు తాను ఆరోగ్యం, మానసిక ప్రశాంతతకే ప్రాధాన్యత ఇస్తున్నానని మృణాల్ స్పష్టం చేశారు. బాడీ షేమింగ్ ఎదుర్కొనే ప్రతి ఒక్కరికీ తన ప్రయాణం ఒక స్ఫూర్తిగా నిలుస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.






