అబ్దుల్ ఫర్హాన్ వివాదంపై స్పందించిన తేజ్.. ఇదే ఫైనల్ అంటూ ప్రెస్ నోట్

by Disha Web Desk 7 |
అబ్దుల్ ఫర్హాన్ వివాదంపై స్పందించిన తేజ్.. ఇదే ఫైనల్ అంటూ ప్రెస్ నోట్
X

దిశ, వెబ్‌డెస్క్: సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం ‘విరుపాక్ష’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజ్.. తనను యాక్సిడెంట్ నుంచి కాపాడిన అబ్దుల్ ఫర్హాన్ అనే వ్యక్తి గురించి మాట్లాడారు. అతనికి ఏమైనా డబ్బులు సాయం చేశారా అనే ప్రశ్నకు బదులిస్తూ ‘‘అతని మానవత్వానికి డబ్బులతో వెలకట్టలేం. అందుకే నా నంబర్ అతనికి ఇచ్చి ఏ అవసరం వచ్చిన కాల్ చేయమని చెప్పాం’’ అంటూ చెప్పుకొచ్చాడు.

అయితే దీనిపై స్పందించిన ఫర్హాన్.. ‘‘అవన్నీ అబద్ధాలే. ఇలాంటి ఫేక్ న్యూస్ వల్ల నేను ఎంతో ఇబ్బంది పడ్డాను. నేను పని చేసే వద్ద మెగా ఫ్యామిలీ నీకు బాగా డబ్బులు ఇచ్చారట కదా.. నువ్వు డబ్బు ఉన్న వాడు అయిపోయావు అంటూ అందరూ వేధించేవారు. దీంతో నా ఉద్యోగం కూడా పోయింది. సాయి ధరమ్ తేజ్ కానీ, మెగా ఫ్యామిలీ కానీ ఎవరూ నన్ను కలవలేదని.. ఎవరి ఫోన్ నంబర్లు నా దగ్గర లేవని’’ తెలిపాడు. దీంతో సాయిధరమ్ తేజ్‌ని ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. అయితే.. తాజాగా వీటిపై స్పందించిన తేజ్.. ‘ఇదే ఫైనల్ క్లారిటీ’’ అంటూ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు.

ఈ మేరకు.. ‘‘నాపై.. నా టీంపై అసత్య ప్రచారం జరుగుతుంది. ఫర్హాన్‌కు మేము ఆర్థికంగా సహాయం చేశామని నేను కానీ, నా బృందం కానీ ఎప్పుడూ ఎక్కడ చెప్పలేదు. అతడు నాకు, నా కుటుంబానికి చేసిన సహాయానికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. అతని వద్ద మా వివరాలు ఉన్నాయి. అతనికి మా సహాయం అవసరమైనప్పుడు మమ్మల్నీ సంప్రదించవచ్చు. నా మేనేజర్ శరన్ అతనికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాడు. ఈ వివాదంలో ఇదే నా చివరి కమ్యూనికేషన్’’ అంటూ ఓ నోట్‌తో పాటు వీడియో జోడించి రిలీజ్ చేశారు. కాగా.. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ ట్వీట్ చూసిన నెటిజన్స్.. తేజ్‌కు మద్దతుగా రిప్లైలు ఇస్తున్నారు.

దూసుకపోతున్న విరూపాక్ష.. 7 రోజుల కలెక్షన్స్ ఇవే?

Next Story

Most Viewed