అర్జున్ రెడ్డిపై తమ్మారెడ్డి భరద్వాజ ఫైర్

by Disha Web Desk 16 |
అర్జున్ రెడ్డిపై తమ్మారెడ్డి భరద్వాజ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో భారీ అంచనాలతో తెరకెక్కిన సినిమా లైగర్. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటించారు. అయితే అనుకున్నంత ప్రేక్షక ఆదరణ లభించకపోవడంతో లైగర్ ప్లాప్ గా నిలిచింది. దీంతో పూరీ ప్రేక్షకుల నుంచి భారీ విమర్శలు ఎదుర్కొంటున్నారు. పలువురు సినీ సెలెబ్రిటీలు కూడా స్పందిస్తూ సినిమా పై అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా సీనియర్ ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విజయ్ దేవరకొండ పై ఫైర్ అయ్యారు.

ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేనే పూరీ డైరెక్షన్ కి వీరాభిమానిని అని చెబుతూ.. లైగర్ సినిమా గురించి నేను మాట్లాడదలచుకోలేదు అంటూ ట్రైలర్ చూసినప్పుడే విరక్తి కలిగిందన్నారు. అయితే సినిమా విడుదలకు ముందు ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ దేవరకొండ ఉపయోగించిన భాషను తప్పుబట్టారు. ప్రమోషన్స్ లో విజమ్ మాట్లాడుతూ.. 'ఆగ్ లగా దేంగే' డైలాగ్‌ను వినిపిస్తూ, ప్రేక్షకులలో, అభిమానులలో ఉత్సాహం నింపారు. అంతేకాకుండా చిటికెలు వేస్తూ మాట్లాడారు. దీన్ని తమ్మారెడ్డి భరద్వాజ 'ఆగ్ లగా దేంగే' కాదు 'ఆగ్ లగా దియా' అంటూ విమర్శించారు. మంచి సినిమా చేశాం అందరూ చూడండి ఆదరించండి అని చెప్పడం పోయి ఇలాంటి డైలాగ్ లతో ఆటిట్యూడ్ చూపిస్తే ఇలానే ఉంటుందని తమ్మారెడ్డి విజయ్ పై మండిపడ్డారు.

డైరెక్టర్ పూరీ పై శ్రీరెడ్డి సంచలన కామెంట్స్


Next Story

Most Viewed